మాదిగల ప్రోద్బలంతోనే రాజకీయంగా ఎదిగానని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి నీకు అండగా ఉన్న మాదిగ జాతిని రాజకీయంగా అణచివేయాలని చూడడం న్యాయమా అని ఎంఆర్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అద్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. మాదిగల వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఇచ్చోడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. నాయకులు సుభాష్, భూమయ్య, గంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.