కోటపల్లి: పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి

50చూసినవారు
కోటపల్లి: పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువ రైతు మృతి
పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి కోటపల్లి మండలం రాపనపల్లిలో బూర్తి సతీష్ (24) విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సతీష్ సాగు చేస్తున్నాడు. మంగళవారం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. పైపులైను సరిచేస్తున్న క్రమంలో మోటారుకు విద్యుత్ అందించే తీగ తెగి ఉండగా సతీష్ గమనించలేదు. ఆ వైర్ తగలడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్