ఐటీ శాఖ మంత్రికి వినతి

50చూసినవారు
ఐటీ శాఖ మంత్రికి వినతి
ఏజెన్సీ ప్రాంతాల్లో తొలగించిన ఎస్సీ, ఎస్టీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలని కోరుతూ హైదరాబాదులో ఐటీ శాఖ మంత్రి దుదెళ్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందించారు. ‌ఈ సందర్భంగా ఐక్యవేదిక దండేపల్లి మండల కన్వీనర్ రాయమల్లు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ వార్డులో రిజర్వేషన్ ఉన్నప్పటికీ 2018- 19 పంచాయతీ ఎన్నికల్లో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి రిజర్వేషన్లను పునరుద్ధరించాలని మంత్రికి విన్నవించారు.

సంబంధిత పోస్ట్