బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించాలి

57చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించాలి
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బూత్ స్థాయిలో ముమ్మరంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం భైంసా పట్టణంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్