బిర్యానీ తిని.. పిల్లలతో సహా వంద మందికిపైగా ఆసుపత్రిపాలు

61చూసినవారు
బిర్యానీ తిని.. పిల్లలతో సహా వంద మందికిపైగా ఆసుపత్రిపాలు
తమిళనాడులోని మదురై జిల్లాలో ఓ పార్టీ కార్యక్రమంలో బిర్యానీ తిని పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే శుక్రవారం పార్టీ కార్యక్రమం నిర్వహించింది. అనంతరం పార్టీ కార్యక్రమానికి హాజరైన వారికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కొందరు అక్కడే బిర్యానీ తినడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్