భార్య మాట విని లాటరీ టికెట్ కొని రూ.2.5 కోట్లు గెలిచాడు

50చూసినవారు
భార్య మాట విని లాటరీ టికెట్ కొని రూ.2.5 కోట్లు గెలిచాడు
పంజాబ్​కు చెందిన ఓ స్క్రాప్​ డీలర్​ను అదృష్టం వరించింది. రాఖీ పండుగ సందర్భంగా రూ.500తో కొన్న లాటరీ టికెట్ ద్వారా ఏకంగా రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు. జలంధర్ జిల్లాలోని ఆదమ్​పుర్​కు చెందిన ప్రీతమ్ లాల్ జగ్గీ(67) గత 50 ఏళ్లుగా లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఒక్కసారి కూడా అతడిని అదృష్టం వరించలేదు. అయితే ఇక చివరి ప్రయత్నంగా భార్య మాట విని ఆమె పేరు మీద రూ.500 టికెట్ కొన్నారు. ఈసారి ఆయన్ను అదృష్టం వరించి రూ.2.5 కోట్లు గెలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్