ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ డిస్నీని కొనుగోలు చేయాలని
రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయం తీసుకుందని ఇటీవల ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే రిలయన్స్కు చెందిన వయాకామ్, వాల్ట్ డిస్నీ సంస్థ స్టార్
ఇండియా విలీనానికి డీల్ కుదిరింది. రూ.70,352 కోట్ల జాయింట్ వెంటర్ ఏర్పాటు చేయగా.. ఇందులో
రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎప్పటినుంచో
రిలయన్స్, వాల్డ్ డిస్నీ విలీనానికి సంబంధించి జరుగుతున్న ప్రచారానికి బుధవారం ఈ సంస్థలు చెక్ పెట్టాయి.