బిహార్లోని అరారియాలో మంగళవారం ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బత్నాహా రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్టాలు దాటుతోంది. ఈ సమయంలో రైలు ఆకస్మాత్తుగా రావడంతో మహిళ పట్టాల కింద పడుకుంది. ట్రైన్ వెళ్లిన తరువాత మహిళ సురక్షితంగా కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.