దుబాయ్ ఎయిర్పోర్టులో పునరుద్ధరణ కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఎయిరిండియా శుక్రవారం దుబాయ్కి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేసింది. ఏప్రిల్ 21 వరకు ప్రయాణానికి విమానాలను బుక్ చేసుకున్న ఎయిర్ ఇండియా ప్రయాణికులకు డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఐదు భారతీయ నగరాల నుండి దుబాయ్కి వారానికి 72 విమానాలను నడుపుతోంది. వాటిలో 32 విమానాలు ఢిల్లీ నుండి ఉన్నాయి.