తెలంగాణలో నిన్నమొన్నటి వరకు వర్షాలు, చలిగాలులతో ఉపశమనం పొందిన ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు నమోదు అయింది. నేడు, రేపు ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.