బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్లలో ISIS ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కీలక నిందితులు ముసావిర్ హుస్సేన్ షజీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా అరెస్ట్తో ఈ కేసు మలుపు తిరిగింది. షిమోగా జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన నిందితులు ISISకు చెందిన కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు NIA వెల్లడించింది. అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులను NIA స్వాధీనం చేసుకుంది.