దేశాన్ని విభజించడం, విచ్ఛిన్నం చేయడం, బలహీనపరచడం అనే ప్రమాదకరమైన ఉద్దేశం కాంగ్రెస్కు ఉందని ప్రధాని మోడీ ఆరోపించారు. కర్ణాటకలోని మైసూరులో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ను “తుక్డే తుక్డే ముఠా సుల్తాన్”గా అభివర్ణించారు. కర్ణాటకలో దోపిడీ కారణంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగడం లేదన్నారు.