AP: మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కాకినాడలో మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది. సోమవారం కూడా అల్లూరి, కాకినాడ,తూర్పుగోదావరి,ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.