అమిత్ షా బస్తర్ పండూమ్ సభ కోసం ఆదివాసీలతో నిండిన పికప్ వాహనాన్ని హడావుడిగా తరలిస్తుండగా ఛత్తీస్ఘడ్లోని దంతేవాడ జిల్లా పాలనార్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు కాగా, కొంతమంది మహిళల చేతి వేళ్లు కట్ అయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ఆదివాసీలను బొమ్మల్లా వాడటం తగదని పేర్కొంది. గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందించి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.