అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైంది. 5 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాలు చెబుతున్నాయి. ఓసారి పార్వతి అమరత్వం గురించి శివుణ్ని అడగగా.. ఆయన వేరేవరూ వినకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలోనే వివరించాడని ప్రతీతి. 15వ శతాబ్ధంలో ఓ గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కున్నారు. అమర్నాథ్ యాత్ర చేయటం వల్ల 23 తీర్థయాత్రలు పూర్తి చేసిన పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వాసం.