జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడులపై అమిత్‌ షా సమీక్ష

56చూసినవారు
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడులపై అమిత్‌ షా సమీక్ష
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటనలు జరగడం, అమర్‌నాథ్‌ యాత్రకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో భద్రతా చర్యలపై అధికారులతో ఆయన దాదాపు ఐదుగంటల పాటు సమావేశమయ్యారు. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తించాలని.. అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్