పార్లమెంట్పై దాడి ఘటనలో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిని ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారు. విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుల్లో ఒకరి దుస్తులు, షూస్, దగ్ధం చేసిన మొబైల్ ఫోన్ రాజస్థాన్లో లభ్యమయ్యాయి. నిందితుడి ఫోన్లన్నీ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా వద్ద ఉన్నాయని, ఆయన ఫోన్లను పగలగొట్టి ఆపై దగ్ధం చేశాడని పోలీసులు చెబుతున్నారు.