బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై కొన్ని రోజుల పాటు రాజకీయాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చెవెనింగ్ ఫెలోషిఫ్ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్లెన్స్ ప్రోగ్రామ్ కోసం యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అన్నామలైకి ఆఫర్ చేసింది. దీంతో 3 నెలల ఆక్స్ఫర్డ్ ఫెలోషిప్ కోసం ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. కాగా జూలై 17తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.