ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మరో వంతెన కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలిన 24 గంటలలోపే సివాన్ జిల్లాలో చిన్న వంతెన కూలిపోయింది. మోతీహరిలో రూ.1.5 కోట్లతో 40 అడుగుల మేర వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. సిమెంటు, ఇసుక సరిపడా వేయకపోవడంతో వంతెన కూలిపోయిందని, కాస్టింగ్కు సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.