గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్లో మరో ఘనత సాధించారు. తక్కువ మ్యాచుల్లో(103) నాలుగు సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో ఏడు సెంచరీలతో బట్లర్, ఆరు శతకాలతో క్రిస్ గేల్, శుభ్మన్ గిల్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ తలో నాలుగు సెంచరీలతో ఉన్నారు.