కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

84చూసినవారు
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బగీషా తివారీ (18) తన తల్లి, సోదరుడితో కలిసి కోటాలోని జవహర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసముంటూ.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (యూజీ)కు సిద్ధమవుతున్న ఆమె కోటాలో కోచింగ్‌ తీసుకుంటోంది. అయితే బుధవారం సాయంత్రం యువతి తాను ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్