నేటి ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు ఐదు సెషన్లలో ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 166 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2.93 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 2.05 లక్షల మంది, ఏపీ నుంచి 88 వేల మంది అభ్యర్థులు ఉన్నారు.