వైసీపీ ఓటమిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తించడంతోనే 151 సీట్లు 11 అయ్యాయని ఎద్దేవా చేశారు. ‘‘ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం.. ప్రతి సమస్యనూ నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కర్నూలులో వలసలు అరికట్టాలి. పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల్లో నీటి ఎద్దడిని నివారించాలి’’ నాయకులతో లోకేశ్ అన్నారు.