పశ్చిమ బెంగాల్లో TMC, BJP మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. గత రాత్రి కోల్కతాలోని బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్పై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తలకు బలమైన గాయమై, రక్తం వచ్చింది. తనపై ఈ దాడికి TMCకి చెందిన గూండాలే చేశారని ఆమె ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు బైటాయించి నిరసన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.