ఐపీఎల్-17 సీజన్ అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డును హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సొంతం చేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన ఐపీఎల్ ముగింపు వేడుకల్లో హైదరాబాద్
క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు హెచ్సీఏకు రూ.50 లక్షల నగదు బహుమతిని కూడా ఐపీఎల్ నిర్వాహకులు అందించారు.