ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన విద్యార్థులు

72చూసినవారు
ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన విద్యార్థులు
బిహార్ లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయంలో ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మెస్ ఓనర్ కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్