ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ తాజాగా మూడు ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు లాంచ్ చేసింది. కంపెనీ వీటికి వరుసగా P5009, P5012, P7012 పేర్లు పెట్టింది. గోగో బ్రాండ్ కింద విడుదలయ్యాయి. గరిష్ట 12kWh బ్యాటరీ మోడల్ సింగిల్ ఛార్జింగ్తో 251 కి.మీ మైలేజీ ఇస్తుంది. దీని నిర్వహణ ఖర్చు కి.మీ.కు కేవలం రూ.1 మాత్రమే అవుతుంది.