పశ్చిమబెంగాల్లో శనివారం ఉదయం నుంచి పంచాయతీ
ఎన్నికలు జరుగుతున్నాయి. కూచ్ బిహార్లోని సితాయిలో ఉన్న బారావిట్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ను నిరసనకారులు ధ్వంసం చేశారు. అలాగే బ్యాలెట్ పేపర్లకు నిప్పు పెట్టారు. మరోవైపు నార్త్ 24 పార్గనాస్లో ఉన్న పోలింగ్ బూత్కు వెళ్తున్న సమయంలో గవర్నర్ సీపీ ఆనంద్ బోస్ను స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ మద్దతుదారులు ఆయనను నిలదీశాడు.