శ్రీశైలం రోడ్డులో ఎలుగుబంటి కలకలం (వీడియో)

68చూసినవారు
నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్