ఫోన్ ట్యాపింగ్ కేసుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలను టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడటం దారుణమన్నారు. గత BRS ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందన్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటన్నారు.మంత్రులు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురయ్యాయంటే.. BRS పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.