ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు ఢిల్లీ కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. బిభవ్ను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఇది తీవ్రమైన కేసు అని.. దెబ్బలు గట్టిగా తగిలాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు అభియోగాలు మోపారు. బిభవ్ విచారణకు సహకరించడం లేదని తెలిపారు. విచారణ కోసం ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. ఢిల్లీ కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.