ఉత్కంఠగా సాగుతున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో దేశ వ్యాప్తంగా ఎన్డియే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఎన్డియే కూటమి 290 స్ధానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. మరోవైపు ఎన్డియే కూటమికి చెందిన కొందరు కీలక అభ్యర్ధులు వెనకంజలో ఉన్నారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వెనకంజలో కొనసాగుతున్నారు.