ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ కుమార్తెను వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికులు చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.