ఢిల్లీలోని తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కారులో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జాతీయ రహదారి 44 ఖంపూర్ భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.