దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి లక్షల కోళ్లు చనిపోతుండడంతో ప్రజలు చికెన్ తినటమే మానేశారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో పెంపుడు పిల్లికి బర్డ్ ఫ్లూ సోకడం సంచలనంగా మారింది. పెంపుడు జంతువులలో అభివృద్ధి చెంది మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజల్లో ఆందోళనకు గురవుతున్నారు.