ఛాంపియన్స్ ట్రోఫీ వేళ పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. వాయువ్య పాకిస్తాన్లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించగా, చాలా మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.