మేడ్చల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు సందేశం వచ్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరీంనగర్కు చెందిన ఓ మావోయిస్టు నేత పేరుతో వచ్చిన ఈ-మెయిల్లో బాంబు పెట్టినట్టు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ను రంగంలోకి దించి, కలెక్టరేట్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.