సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సేవలు రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో ఆ అవస్థలకు చెల్లుచీటీ పాడేలా ప్రభుత్వం స్లాట్ బుకింగ్ సేవలను అమలులోకి తీసుకురానుంది. ఈ విధానం ద్వారా ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.