కేరళలో రెండు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తిరువనంతపురం, పథనంథిట్ట కలెక్టరేట్లలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. పథనంథిట్ట కలెక్టరేట్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అటు తిరువనంతపురంలో డాగ్ స్క్వాడ్తో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.