రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్‌

52చూసినవారు
రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్‌
ఢిల్లీలో రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు తొలుత బురారీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.26 గంటల సమయంలో సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు రెండో బెదిరింపు వచ్చిందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్