అత్యంత వేగంగా వెళ్లే వందేభారత్ రైళ్లు ఢీకొనడంతో పలు చోట్ల ఆవులు చనిపోతున్నాయి. ఇదే కోవలో తాజాగా ఓ ఆవును రైల్వే ట్రాక్పై గుర్తించి లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ వందేభారత్ కింద భాగంలో ఆవు సగభాగం ఇరుక్కుపోయింది. ట్రైన్ను కొంచెం వెనక్కి పోనివ్వగానే ఆ ఆవు బయటపడింది. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. లోకోపైలట్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.