యూపీలోని అరౌల్ ప్రాంతంలోని మకాన్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలుడిని కొంతమంది ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితుడిని స్నేహితులు గ్రామ శివారుకు ఎత్తుకెళ్లి తాడుతో కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలుడిని గొంతు బిగించి, ఇనుప రాడ్తో తీవ్రంగా కొట్టి చంపేసి 40 అడుగుల లోతు ఉన్న బావిలో పడేశారు. నిందితులు అజ్జు, నాజర్ అలీ, ఔసఫ్ అలీ కోసం పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.