అరబ్ దేశాలలో ఒకటైన యెమెన్ లో తీవ్ర విషాద ఘటన జరిగింది. సముద్రంలో ప్రయాణిస్తున్న వలసదారుల బోటు ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో 49 మంది మృతి చెందారు. మరో 140 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.