రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్లోని CCMBకీలక పురోగతి సాధించింది. సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను గుర్తించే నిర్దిష్ట బయోమార్కర్లను గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్, విస్తతమైన ధ్రువీకరణ అనంతరం ‘ల్యాబ్ ఆన్ చిప్’గా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. CCMBలోని క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త దినేశ్ కుమార్ బృందం చేపట్టిన పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి.