మృతదేహంతో రాస్తారోకో చేసి.. ర్యాలీ చేసిన BRS నేతలు

72చూసినవారు
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో BRS నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ మృతదేహంతో రాస్తారోకో చేసి, ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపల్లి గ్రామానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకెళ్లారు. ఈ నిరసన ర్యాలీలో మాజీమంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మన్నె క్రిశాంక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్