లోక్సభ ఎన్నికల్లో BRSకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 3 నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారన్నారు. కాంగ్రెస్ 12-13 సీట్లు గెలుస్తుందన్నారు. 'ఎమ్మెల్సీ కవిత అరెస్ట్తో కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరూ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించి స్వాగతం పలుకుతాం’ అని అన్నారు.