రేవంత్ రెడ్డిని
కాంగ్రెస్ ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదని మాజీ మంత్రి
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు
కాంగ్రెస్ కీలక నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని ముందుగానే
కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీఆర్ఎస్కు మూడు సీట్లు కూడా రాకపోయేవన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చే సీట్లు సంఖ్య శూన్యమని అన్నారు.