జులై మొదటి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18 నుంచి శాఖలవారీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పథకాలకు ఖర్చయ్యే మొత్తం, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఆర్థికశాఖ వివరాలు సేకరిస్తోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర పద్దుకు తుది మొరుగులు దిద్దనున్నట్లు సమాచారం.