దేశంలోనే తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరణించిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించి వాటి అర్ధాంతర చావులకు సమగ్ర కారణాలు తెలుసుకుంటోంది. అటవీ, పశు సంవర్థక శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల నిపుణులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఏనుగుల సంరక్షణకు, వాటి బారి నుంచి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.