భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఉత్పత్తిలో 63 శాతం వాటాతో MP మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలోని మంద్సౌర్ మార్కెట్ వెల్లుల్లికి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 75 శాతం వాటా చైనాదే. మన దేశానిది రెండో స్థానం. భారత్ నుంచి వెల్లుల్లి అధికంగా బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుంది.